మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ కరోనా కారణంగా నిలిపేసిన విషయం తెల్సిందే.
ఇదే సమయంలో ఈ చిత్రం నిర్మాణ బాధ్యతల నుండి రామ్ చరణ్ తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.మొత్తం కూడా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి చూసుకుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో స్వయంగా నిరంజన్ రెడ్డి స్పందించాడు.
ప్రెస్ నోట్ను విడుదల చేసిన నిరంజన్ రెడ్డి అసలు విషయాన్ని తెలియజేశాడు.ఆ వార్తలు అన్నీ కూడా పుకార్లే అన్నాడు.సినిమా నిర్మాణ వ్యవహారాల్లో రామ్ చరణ్ పాల్గొనడం లేదు అంటూ వచ్చిన వార్తలు నిజం కాదన్నాడు.చరణ్ ఎంత బిజీగా ఉన్నా కూడా చిరంజీవి 152 చిత్రం గురించిన ప్రతి విషయంలో కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు.
నిర్మాణ వ్యవహారంలో రెండు సంస్థలు కూడా ఈక్వెల్గా భాగస్వామ్యంతో వ్యవహరిస్తున్నాయని అన్నాడు.
రామ్ చరణ్ నిర్మాణ వ్యవహారాలు పట్టించుకోవడం లేదంటూ మీడియాలో వచ్చిన వార్తలకు ఆయన ప్రెస్ నోట్తో క్లారిటీ వచ్చినట్లు అయ్యింది.ఆచార్య చిత్రంలో హీరోయిన్ ఇంకా రామ్ చరణ్ నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై మాత్రం ఆయన స్పందించలేదు.చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నా కూడా ఆచార్య నిర్మాణ వ్యవహారంలో కూడా భాగస్వామిగా కీలకంగా వ్యవహరిస్తున్నట్లుగా నిరంజన్ పేర్కొన్నాడు.