బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా పఠాన్.ఈ సినిమాలో షారుక్ ఖాన్, దీపికా పదుకొనే కలిసి నటించిన విషయం తెలిసిందే.
ఇకపోతే ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమంలో మల్టీ స్టారర్స్ రూపుదిద్దుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలోనే వార్, పఠాన్ లాంటి సినిమాలను తెలకెక్కించిన డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో మరొక భారీ మల్టీస్టారర్ సినిమా రాబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.
భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్టులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అలాగే హృతిక్ రోషన్ కలిసిన నటించబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నారు అంటూ కూడా వార్తల జోరుగా వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని అలాగే దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ప్రత్యేకంగా కలవడంతో అది అనేక రకాల అనుమానాలకు ప్రశ్నలకు తావిస్తోంది.సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పటాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతో ప్రొడ్యూసర్ నవీన్ ప్రత్యేకంగా సిద్ధార్థ్ ఆనంద్ ని కలిసి బొకే ఇచ్చి మరి శుభాకాంక్షలు అందజేశారు.
సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.కానీ వారిద్దరూ కలవడంతో ప్రభాస్ హృతిక్ రోషన్ల మల్టి స్టారర్ సినిమాను నవీన్ కన్ఫామ్ చేసినట్టు అభిమానులు నెట్టిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.ఇకపోతే పటాన్ సినిమా విషయానికి వస్తే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది.ఈ సినిమా విడుదల అయ్యి వారం రోజులు దాటి పోయినా కూడా థియేటర్స్ కి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తూనే ఉన్నారు.
ఇకపోతే ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్ అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు.