తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ కి, అల్లు ఫ్యామిలీ కి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి మనందరికీ తెలిసిందే.ఈ ఇరువురి కుటుంబ సభ్యులు పండుగ సమయాలలో, ఫంక్షన్ల సమయాలలో కలిసిమెలిసి వాటిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.
మెగా ఇంట్లో ఏదైనా వేడుక జరిగింది అంటే చాలు అక్కడికి అల్లు ఫ్యామిలీ చేరుకొని ఆ వేడుకలో భాగంగా సందడి సందడి చేస్తూ ఉంటారు.స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మేనత్తను చిరంజీవి పెళ్లి చేసుకోవడంతో ఈ రెండు కుటుంబాల మధ్య బంధాలు మరింత బలపడ్డాయి.
ఇది ఇలా ఉంటే అల్లు ఫ్యామిలీ కి, మెగా ఫ్యామిలీ కి మధ్య గ్యాప్ వచ్చింది అన్న వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.
ఈ విషయంపై తాజాగా అల్లు అర్జున్ మేనమామ ముత్తంశెట్టి కృష్ణ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.
పుష్ప సినిమా మంచి విజయం సాధించడంతో అందులో భాగంగా ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు.ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణ ప్రసాద్ పలు ఆసక్తికర విషయాల గురించి వెల్లడించారు.
ఈ సందర్భంలోనే ఇంటర్వ్యూ లో భాగంగా అతనిని పలు ప్రశ్నలు అడగగా.సమాధానమిచ్చారు.
మెగా ఫ్యామిలీ కి, అల్లు ఫ్యామిలీ కి మధ్య గ్యాప్ వచ్చింది.అందువల్లే ముత్తం శెట్టి మీడియా, ముత్తంశెట్టి బ్రదర్స్ నిర్మాతలుగా లైమ్ లైట్ లోకి వచ్చారంటూ వినిపిస్తున్న వార్తల్లో నిజం ఎంత అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కృష్ణ ప్రసాద్ ని ప్రశ్నించగా.
కృష్ణ ప్రసాద్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
అది నూటికి నూరుశాతం అబద్ధం అంటూ కాస్త ఘాటుగా స్పందించారు.అల్లు అర్జున్ తన మేనమామలకు మంచి గుర్తింపు రావాలని ఇలా మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు తప్ప.బయట జనం మాట్లాడుకుంటున్న దానికి, మా ఎంట్రీ కీ ఎటువంటి సంబంధం లేదు అని కృష్ణప్రసాద్ తేల్చి చెప్పారు.
మన స్వతంత్ర దేశంలో పబ్లిక్ కి ఏదైనా అనుకునే స్వేచ్ఛ ఉంది కాబట్టి అది వాళ్ళ ఇష్టం అని తెలిపారు కృష్ణప్రసాద్.కాకపోతే తన మేనమామల తో ఒక మంచి ప్రాజెక్టు చేయాలన్న ఆలోచన బన్నీ కీ ఎప్పటినుంచో ఉంది కాబట్టి ఈ పుష్ప సినిమాలో భాగం చేశారు అని ఆయన చెప్పుకొచ్చారు.