నిర్మాత ఎమ్.ఎస్.
రాజు గుర్తు ఉన్నారుగా అందరికి ? గుర్తుకు ఉండే ఉంటారు.ఎలా మరచిపోతారు.
సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి వరుస విజయాలతో టాలివుడ్ ని ఓ ఊపు ఊపిన నిర్మాత ఆయన.
ఆయన కుమారుడు హీరోగా చేసిమ కోలంబస్ ఇటివలే విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు ఎమ్.ఎస్ రాజు.మహేష్ తో ఒక్కడు, ప్రభాస్ తో వర్షం నిర్మించిన ఆయనకి వాళ్లిదరితో ఇప్పటికి సత్సంబంధాలు ఉన్నాయట.మహేష్ ఎప్పుడు కలిసిన సినిమా ప్లాన్ చేయండి, చేద్దాం అంటారట.
ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ కెరీర్ సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రస్తుతం సుమంత్ ప్రేమకథలు చేయడమే కరెక్ట్ అని, ఆమీర్ ఖాన్ కుడా మొదట ప్రేమకథలే చేసారని, క్రమంగా పెద్ద స్టార్ గా ఎదిగారని చెప్పారు.
ఇదే ఎడాది చివర్లో ఓ పెద్ద హీరోతో ఓ సినిమా, అలాగే కుమారుడు సుమంత్ అశ్విన్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు ఎమ్.ఎస్.రాజు.