టాలీవుడ్ లో క్రియేటివ్ దర్శకుడుగా తనకంటూప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి కృష్ణవంశీ.అతను ఏ సినిమా చేసిన అందులో తన ప్రత్యేకత కచ్చితంగా చూపించుకుంటాడు.
అయితే ఆయన చివరిగా చేసిన మొగుడు, నక్షత్రం సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.ఆ సినిమాలు నిర్మాతలకి కూడా భారీ నష్టాలు మిగిల్చాయి.
దీంతో కృష్ణవంశీ సినిమా అంటే నిర్మాతలు కొంత భయపడతారు.ముందు చెప్పిన బడ్జెట్ ని షూటింగ్ టైంలో దాటించేస్తాడని, అసలు బడ్జెట్ కంట్రోల్ ఉండదనే అభిప్రాయం కృష్ణవంశీ మీద ఉంది.
పెర్ఫెక్షన్ కోసం తీసిందే మళ్ళీ మళ్ళీ తీస్తూ ఉంటారనే అపవాదు కూడా ఉంది.ప్రస్తుతం కృష్ణవంశీ బెంగాలీ హిట్ మూవీ నట సామ్రాట్ ని రంగ మార్తాండ టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.
ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ఇందులో మెయిన్ లీడ్స్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది.లాక్ డౌన్ తర్వాత మరల తిరిగి షూటింగ్ స్టార్ట్ చేశారు.అయితే మరో ఇరవై రోజులు షూటింగ్ పెండింగ్ లో ఉంది.
ఇప్పుడు ఉన్నపళంగా నిర్మాత చేతులెత్తేసినట్లు తెలుస్తుంది.ఇప్పటికే అనుకున్న బడ్జెట్ దాటిపోయిందని, ఫైనాన్స్ కూడా ఎవ్వరూ ఇవ్వడం లేదని నిర్మాత కృష్ణవంశీకి క్లారిటీగా చెప్పేసి తన వల్లకాదని ఆగిపోయినట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో మిగిలిన షెడ్యూల్ పూర్తి చేయడానికి ఇంకో నిర్మాత కోసం కృష్ణవంశీ ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నాడు.మొత్తానికి కృష్ణవంశీ దెబ్బకి కొత్త నిర్మాతకి రంగ మార్తాండతో గట్టిగా తగిలిందని టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తుంది.
రంగ మార్తాండ సినిమా మీద బడ్జెట్ పెట్టడానికి ఇంకో నిర్మాత ఎప్పుడు వస్తే మళ్ళీ అప్పుడే తిరిగి షూటింగ్ స్టార్ట్ అవుతుంది.