టాలీవుడ్లోనే దిగ్గజ నిర్మాత అయిన దిల్రాజు నిర్మాణ భాగస్వామి లక్ష్మణ్ అనే విషయం తెల్సిందే.వీరిద్దరి కలయికలో వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.
ప్రస్తుతం టాలీవుడ్లో వీరిద్దరు టాప్ ప్రొడ్యూసర్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.నిర్మాతగా సూపర్ సక్సెస్లు అందుకున్న లక్ష్మణ్ తన కొడుకు ఉజ్వల్ వివాహ నిశ్చితార్థ వేడుకను నిన్న గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో వైభవంగా జరిపించాడు.
ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు దిల్రాజు, శిరీష్, ప్రభాస్, విజయ్ దేవరకొండ, మంత్రి హరీష్ రావు, రేవంత్ రెడ్డి, వివి వినాయక్, సుకుమార్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, నమ్రత శిరోద్కర్ ఇంకా ప్రముఖ నటీనటులు టెక్నీషియన్స్ నిర్మాతలు హాజరు అయ్యారు.త్వరలోనే వివాహ వేడుక కూడా వైభవంగా జరుగనున్నట్లుగా కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు.ఈ వేడుకలో పాల్గొన్న ప్రముఖులను ఇక్కడ చూడవచ్చు.