పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది.40 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయింది.ఇక ఆ మధ్య రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ టీజర్ సినిమా మీద అంచనాలు మరింత పెంచే విధంగా ఉంది.
పవన్ కళ్యాణ్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం విశేషం.ఇక మొఘలాయిల కాలం నాటి తెలంగాణకి చెందిన బందిపోటు దొంగ నిజ జీవిత కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.
భూస్వాములని దోచుకొని అడవిబిడ్డల ఆకలి తీర్చే ఆ బందిపోటు దొంగ వీరత్వాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నారు.ఇక ఆ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు.ఇదిలా ఉంటే ఈ క్యారెక్టర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రాచీన యుద్ధ విద్యలని కూడా ప్రత్యేకంగా నేర్చుకున్నారు.
మల్లయోధులతో యాక్షన్ సీక్వెన్స్ కూడా సినిమాలో ఉండనున్నాయి.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తుంది.అలాగే పవన్ కళ్యాణ్ కూడా కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడి కోలుకున్నారు.
ప్రస్తుతం ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు.అయితే ప్రస్తుతం సెకండ్ వేవ్ ప్రభావం కారణంగా షూటింగ్ చేయలేని పరిస్థితి నెలకొని ఉంది.
ఈ నేపధ్యంలో వీరమల్లు సినిమా రిలీజ్ లేట్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.అయితే తాజాగా ఈ విషయంపై నిర్మాత ఏ.ఏం.రత్నం క్లారిటీ ఇచ్చారు.సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశమే లేదని తేల్చేశారు.ఎట్టి పరిస్థితిలో సంక్రాంతికి హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందని చెప్పాడు.దీని బట్టి పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాడని అర్ధమవుతుంది.