కీర్తి సురేష్ లీడ్ రోల్ లో నగేష్ కుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ గుడ్ లక్ సఖి.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీలో కీర్తి సురేష్ కి జోడీగా ఆది పినిశెట్టి నటించాడు.
విలేజ్ నేపధ్యంలో కామెడీ అండ్ ఎమోషనల్ స్పోర్ట్స్ ఎలిమెంట్స్ తో ఈ మూవీని దర్శకుడు తెరపై ఆవిష్కరించాడు.ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచింది.
కరోనా సెకండ్ వేవ్ లేకుండా ఉంటే ఈ నెలలోనే ఈ మూవీ రిలీజ్ అయ్యేది.ఇదిలా ఉంటే గత ఏడాది కీర్తి సురేష్ నుంచి వచ్చిన పెంగ్విన్ , మిస్ ఇండియా మూవీలు డైరెక్ట్ ఒటీటీలో రిలీజ్ అయిపోయాయి.
ఈ నేపధ్యంలో గుడ్ లక్ సఖి కూడా ఒటీటీ రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారని, ఇప్పటికే ప్రముఖ ఒటీటీ చానల్ జీ5తో సంప్రదింపులు అయిపోయాయని టాక్ వినిపించింది.త్వరలోనే ఈ మూవీ డిజిటల్ రిలీజ్ డేట్ ని కూడా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని ప్రచారంలోకి వచ్చింది.
అయితే ఈ విషయంపై తాజాగా నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.గుడ్ లక్ సఖి ఒటీటీ రిలీజ్ అనే విషయంలో ఎలాంటి వాస్తవం లేదని, తమకి అలాంటి ఆలోచన కూడా లేదని తేల్చేశారు.
కచ్చితంగా మూవీని థియేటర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నామని స్పష్టం చేశారు.ఒక వేళ వేరే ఆలోచన ఏదైనా ఉంటే తామే నేరుగా ప్రకటిస్తామని అంత వరకు వెయిట్ చేయాలని కోరారు.
మొత్తానికి నిర్మాతల క్లారిటీతో గుడ్ లక్ సఖి ఒటీటీ రిలీజ్ లేదని స్పష్టం అయిపొయింది.