టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరో సారి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఆయన భార్య తేజస్విని తో పాటు శ్రీవారిని నేడు తెల్లవారు జామున వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా దిల్ రాజు దంపతులకు ఆలయ అధికారులు మరియు అయ్యవార్లు ప్రత్యేక దర్శనం కల్పించడంపై తో పాటు ఆశీర్వాదాలు అందించి స్వామి వారి లడ్డూ ప్రసాదం ఇచ్చారు.తేజస్విని ని వివాహం చేసుకున్న తర్వాత దిల్ రాజు తిరుమలకు వెళ్లడం ఇది మూడవ సారి గా తెలుస్తోంది.
ప్రతి నెల ఆయన ఒక్కసారైనా శ్రీవారి దర్శనం చేసుకుంటారు.పెళ్లి అయిన సమయంలో వెంటనే వారిని దర్శించుకోవాలి ఉన్నా కూడా లాక్ డౌన్ కారణంగా అప్పుడు దిల్ రాజు దంపతులు తిరుమల శ్రీవారి దర్శనంకు వెళ్ల లేక పోయారు.
ఎప్పుడైతే అన్ లాక్ మొదలైందో తిరుమల ఓపెన్ చేశారో వెంటనే సతీసమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లారు.ఆ సమయంలో దిల్ రాజు తల నీలాలు కూడా ఇచ్చారు.
ఇక దిల్ రాజుకు వెంకటేశ్వర స్వామి అంటే అమితమైన భక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆ కారణంగానే తన నిర్మాణ సంస్థకు వెంకటేశ్వర క్రియేషన్స్ అని పేరు పెట్టిన విషయం అందరికి తెలిసిందే.
కొత్త సినిమా ప్రారంభించాలన్నా విడుదల చేయాలన్నా ఏ ముఖ్య పని తలపెట్టినా కూడా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఎన్నో సూపర్ హిట్ దక్కించుకున్న టాలీవుడ్ లో నెంబర్ వన్ నిర్మాతగా పేరు దక్కించుకున్నాడు అనడంలో సందేహం లేదు.అందుకే ఆయనకు వెంకటేశ్వర స్వామి అంటే అమితమైన భక్తి.ఇక ప్రస్తుతం ఆయన నిర్మాణంలో రూపొందుతున్న సినిమాల విషయానికి వస్తే ఒక వైపు వకీల్ సాబ్ సినిమాను నిర్మిస్తున్న ఆయన మరోవైపు ఒక చిన్న సినిమాని కూడా నిర్మిస్తున్నాడు.
ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.