దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నార్త్ ఇండియాలో జరుగుతుంది.
కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల స్ఫూర్తి తో తెరకెక్కుతున్న ఈ సినిమాని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా హిందీ రిలీజ్ రైట్స్ ని అమ్మేసినట్లు తెలుస్తుంది.2020 సమ్మర్ లో ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నాడు.అందులో భాగంగానే సినిమా షూటింగ్ కి కావాల్సిన సెట్స్ ని ఇప్పటికే సిద్ధం చేసేసుకున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కోసం దుబాయ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏకంగా 66 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సంస్థ సాహో ఒవర్సీర్ రైట్స్ సొంతం చేసుకుందని సమాచారం.అయితే సదరు సంస్థ ఆఫర్ చేసిన దాని కంటే నిర్మాత దానయ్య ఎక్కువగా ఏకంగా 70 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
రాజమౌళి మార్క్, రామ్ చరణ్, ఎన్టీఆర్ క్రేజీ సినిమా బిజినెస్ కి బాగా ఉపయోగపడుతుందని నమ్మకంతో నిర్మాత ఈ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.సుమారు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కు ముందే బిజినెస్ పూర్తి చేయాలనే ఆలోచనతో దర్శకుడు రాజమౌళితో పాటు నిర్మాత దానయ్య ఉన్నట్లు తెలుస్తుంది.