టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప కోసం కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి.అయితే ఈ క్రమంలో పుష్ప చిత్రం గురించి ఇండస్ట్రీ వర్గాల్లో గతకొద్ది రోజులుగా ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది.
పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ విషయంపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన వై.
రవి శంకర్ క్లారిటీ ఇచ్చారు.పుష్ప చిత్రానికి సెట్ అయిన కథ అద్భుతంగా ఉందని, ఈ కథను కేవలం రెండున్నర గంటల్లో చెప్పడం వీలు కాదని, అందుకే ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు.
దీంతో పుష్ప చిత్రం గురించి వస్తున్న వార్తలు నిజమని తేలిపోయింది.ఇక పుష్ప చిత్రం పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా, సుకుమార్ మార్క్తో వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమాలో బన్నీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా ఊరమాస్ లుక్తో మనకు కనిపించనున్నాడు.కాగా ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది.
ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందిస్తుండటంతో పుష్ప చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరి పుష్ప చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.