మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీతారామం. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
కేవలం మౌత్ టాక్ ద్వారా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే కాకుండా కలెక్షన్ల పరంగా భారీ వసూళ్లను రాబడుతోంది.దాదాపు రెండు సంవత్సరాల పాటు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని అయితే సినిమాకు తగ్గ ఫలితం లభించిందని తెలుస్తుంది.
ఇకపోతే ఈ సినిమాని శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ ఆయన కూతురు స్వప్న సంయుక్తంగా నిర్మించారు.
ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూసి నిర్మాత అశ్వినీ దత్ ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.సీతారామం సినిమా విజయాన్ని చూస్తుంటే తనకు మరో జన్మ ఎత్తినట్టు ఉందని ఈ సందర్భంగా ఈయన ఎమోషనల్ అయ్యారు.
త్వరలోనే మా బ్యానర్ స్థాపించి 50 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుందని ఇప్పటికీ తమ సంస్థను ఇంతగా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్క ప్రేక్షకుడికి శిరస్సు వహించి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇక తన సినీ కెరియర్లో ఎప్పటికైనా ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమా నిర్మించాలని తన కోరికని అయితే సీతారామం సినిమాతో ఆ కోరిక కూడా తీరిపోయిందని అశ్వినీ దత్ పేర్కొన్నారు.ఈ సినిమాకు కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా తమిళ కన్నడ మలయాళ భాషలలో కూడా మంచి ఆదరణ రావడం విశేషం.ఇక ఈ సినిమాని రెండు సంవత్సరాల పాటు తన కుమార్తె స్వప్న ఒంటి చేత్తో నడిపిందని అందుకు ఆమెకు అశ్వినీ దత్ కృతజ్ఞతలు తెలిపారు.
అశ్వినీ దత్ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.