ఛార్మి హీరోయిన్గా నటించిన ‘జ్యోతిలక్ష్మి’ ఈవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కడం వల్ల ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ దక్కింది.
గతంలో ఛార్మి నటించిన ఏ సినిమాకు రాని క్రేజ్ తాజా సినిమాకు రావడంతో ఛార్మి ఫుల్ హ్యాపీగా ఉంది.ఇప్పటికే బిజినెస్ను కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ‘జ్యోతిలక్ష్మి’ ఉంది.
ఇక ఛార్మి నటించిన మరో సినిమా కూడా ఇదో జోష్తో రావాలని ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఛార్మి కెరీర్లో గుర్తిండి పోయే సినిమా ‘మంత్ర’.సూపర్ హిట్ అయిన ఆ సినిమాకు కొంత కాలం క్రితం సీక్వెల్ ప్రారంభం అయ్యింది.‘మంత్ర`2’గా తెరకెక్కిన ఈ సినిమాను గత కొంత కాలంగా పూర్తి అయినా కూడా విడుదల చేయకుండా అలాగే ఉంచుతున్నారు.సరైన బిజినెస్ కాకపోవడం వల్లే విడుదల చేయడం లేదనే టాక్ కూడా వచ్చింది.తాజాగా ‘జ్యోతిలక్ష్మి’తో ఛార్మికి క్రేజ్ దక్కడంతో ‘మంత్ర`2’ను తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈనెల 12న ‘జ్యోతిలక్ష్మి’ విడుదల అయితే ఆ వెంటనే వారం గ్యాప్లో 19వ తారీకున ‘మంత్ర`2’ తీసుకు రావాలనే ప్లాన్ చేస్తున్నారు.సందట్లో సడేమియా అంటే ఇదే కాబోలు.