తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్న ప్రియాంకా కుమారుడు

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ,రాబర్ట్ వాద్రా ల కుమారుడు రైహాన్ వాద్రా తొలిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ లో ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

 Priyanka Roberts Son Raihan Utilize His First Time Voting-TeluguStop.com

ఈ క్రమంలో గతేడాదే రైహన్ 18 వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం తో ఈ ఎన్నికల్లో తన తోలి ఓటు హక్కును వినియోగించుకున్నారు.తన తల్లి ప్రియాంక, తండ్రి రాబర్ట్ వాద్రాలతో కలసి ఆయన పోలింగ్ బూత్ కు వచ్చి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మరోవైపు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన రైహాన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.రైహాన్ ను చూసిన మీడియా మొత్తం కూడా ఆయనను చుట్టుముట్టింది.

Telugu Delhi Assembly, Priyankagandhi, Priyankason, Raihan, Raihan Latest, Sonia

ఈ సందర్భంగా రైహాన్ మాట్లాడుతూ, తన జీవితమంతా ఢిల్లీలోనే గడిచిందని ఈ నగరం మరింత అభివృద్ధి చెందాలని, ప్రపంచ అగ్రస్థాయి నగరాల సరసన ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపాడు.ప్రజల కోసం తాను ఓటు వేశానని, ప్రజా రవాణా వ్యవస్థ అందరికీ అందుబాటులోకి రావాలని, విద్యార్థులకు రాయితీలు కల్పించాలని కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube