సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి హత్య కేసులో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఆమె తండ్రి రాత్రి 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడట.
అయితే పోలీసులు ప్రియాంక రెడ్డి మిస్సింగ్ కేసును నమోదు చేసేందుకు మొదట ఒప్పుకోలేదు.రెండు పోలీస్ స్టేషన్లను తిరిగిన తర్వాత మిస్సింగ్ కేసును నమోదు చేసుకునేందుకు ఓకే చెప్పారట.
ఆ సమయంలో కూడా ప్రియాంక రెడ్డి తండ్రితో పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటా.
ప్రియాంక రెడ్డి తండ్రి మాట్లాడుతూ.
నా కూతురు కనిపించడం లేదంటూ 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాను.అప్పుడు వెంటనే పోలీసులు స్పందించి ఉంటే బాగుండేది.
కాని పోలీసులు చాలా ఆలస్యం చేశారు.పోలీసుల చేసిన ఆలస్యం కారణంగానే నా కూతురు చనిపోయింది.
ఇప్పుడు ఎన్ని బృందాలు నిందితుల కోసం వెదికితే ఏం లాభం, ఆ నింధితులకు ఎలాంటి శిక్ష పడితే నాకు ఏం లాభం అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించలేదంటూ ఆయన వ్యాఖ్యలు చేశాడు.