తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ లుగా ఆఫర్లు రావడం లేదు అనే టాక్ ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉంది.కాని ఇప్పుడు ఆ అపవాదు మెల్ల మెల్లగా తప్పి పోతుంది.
తెలుగు లో తెలుగు అమ్మాయిలు వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు.తెలుగు సినిమాలు మరియు ఇతర భాషల సినిమాలను కూడా తెలుగు అమ్మాయిలు చేస్తున్న విషయం తెల్సిందే.
ట్యాక్సీ వాలా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన తెలుగు అమ్మాయి ప్రియాంక జవాల్కర్ ఒక్కసారే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ట్యాక్సీ వాలా తర్వాత అందరిలాగే ఈమె కూడా కనిపించకుండా కనుమరుగయ్యే అవకాశం ఉందని అంతా అనుకున్నారు.
కాని అనూహ్యంగా ఈ అమ్మడు రెండు సినిమాలు చేసింది.అవే సత్యదేవ్ నటించిన తిమ్మరుసు మరియు కిరణ్ నటించిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం.
ఈ రెండు సినిమాలు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.హీరోయిన్ గా ఆమెకు మంచి ఆఫర్లు తెచ్చి పెడుతాయని నమ్మకం వ్యక్తం అవుతోంది.
హీరోయిన్ గా ట్యాక్సీవాలాతో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్ ఆమద్య కాస్త లావు అయ్యింది.ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఈమె సరైన డైట్ మరియు వర్కౌట్స్ లేక పోవడంతో చాలా బరువు పెరిగింది.పెద్ద ఎత్తున ఈ అమ్మడు బరువు పెరగడంతో మళ్లీ ఈమె అసలు సినిమాలు చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.సినిమాలు చేసేందుకు ఈమె కు మళ్లీ స్కోప్ లేదు అని కూడా కొందరు కామెంట్స్ చేశారు.
అలాంటి పరిస్థితి నుండి మళ్లీ ఇలా సన్నగా నాజూకుగా కనిపించే స్థాయి వరకు వచ్చేసింది.ఈ అమ్మడి నాజూకు రూపం ను ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు.
బొద్దు గుమ్మ కాస్త జీరో సైజ్ తో సన్నని నడుముతో ఆకట్టుకుంది.అందంతో పాటు సన్నని రూపంతో ఈ అమ్మడు ఆకట్టుకుంది అంటూ నెట్టింట ఈమె ఫొటోలకు తెగ కామెంట్స్ వస్తున్నాయి.