విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక జవాల్కర్.మొదటి చిత్రమే భారీ హిట్ కొట్టినా కూడా ప్రియాంకకు పెద్దగా అవకాశాలు రాలేదు.
ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గానే ఉంది.ఈ ఏడాది ప్రియాంక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది.
ఎస్.ఆర్ కళ్యాణమండపం, తిమ్మరుసు లాంటి సినిమాలతో సూపర్ హిట్ ను అందుకుంది.ప్రస్తుతం గమనం సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా గమనం చిత్రాన్ని నిర్మించారు.లేడీ డైరెక్టర్ సంజనా రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
అలాగే ఈ సినిమాతో సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కానుంది.ఈ గమనం సినిమాను డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నారు.
అయితే సినిమా ప్రమోషన్స్లో భాగంగా ప్రియాంక జవాల్కర్ మీడియాతో ముచ్చటించింది.
ఈ క్రమంలోనే ప్రియాంక మాట్లాడుతూ.
కమర్షియల్ సినిమాల గురించి కామెంట్ చేసింది.
గమనం సినిమాలో నటనకు ఎక్కువగా స్కోప్ ఉంటుందని, డైలాగ్స్ ఎక్కువగా ఉండవని, కళ్లతోనే నటించాల్సి ఉంటుందని అది చాలా కష్టంగానే అనిపించిందని ప్రియాంక చెప్పుకొచ్చింది.ఇలాంటి పాత్రలు ఒప్పుకోవడం వెనుక కారణం కూడా ఉందని అంది.ఇలా నటన ప్రాధాన్యమున్న సినిమాలు, పాత్రలు చేస్తే మిగతా దర్శకులు కూడా అవకాశాలు ఇస్తారు.
అసలే నన్ను చూసి అందరూ కమర్షియల్ చిత్రాలకు మాత్రమే పనికొస్తానని అనుకుంటారని, కానీ నేను ఎలాంటి పాత్రలోనైనా చేయగలనని ఈ సందర్భంగా ప్రియాంక చెప్పుకొచ్చింది.