అతి త్వరలోనే అస్సాం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి అందరికీ విదితమే.అసెంబ్లీ ఎన్నికలలో భాగంగానే ప్రముఖ రాజకీయ నేతలు అప్పుడే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది.కాని, ఈసారి మాత్రం ఎలాంటి పరిస్థిలోనైనా కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం పీఠాన్ని సొంతం చేసుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ తరుణంలో కాంగ్రెస్ నేతలు అస్సాంలో జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు.
ఇలా ఉండగా తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అస్సాం రాష్ట్రంలో ప్రచారం మొదలుపెట్టారు.
ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని విశ్వనాథ్ ప్రాంతంలో ఉన్న సద్గురు టీ గార్డెన్ లోని కార్మికులతో మాట్లాడి వారి యోగక్షేమాలను కనుక్కున్నారు.అనంతరం ప్రియాంక గాంధీ తేయాకు గార్డెన్ లో టీ ఆకులను సేకరించారు.
అందుకు సంబంధించిన వీడియో ప్రియాంక గాంధీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.
“గడిచిన 5 సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వం అస్సాం రాష్ట్రంలో మహిళలకు చేసింది ఏమీ లేదని ఆరోపణలు చేశారు.అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమయిందని” పేర్కొన్నారు.అంతేకాకుండా గడిచిన 5 సంవత్సరాలుగా మహిళల కోసం ఏమీ చేయలేని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం ఎన్నికల సమయంలో మహిళల ఓట్ల కోసం వాళ్ళకి స్కూటర్లు పంపిణీ చేస్తున్నారని ఆరోపణలు చేశారు.ఇది ఇలా ఉండగా మరోవైపు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఆకర్షణీయమైన రాజకీయ విన్యాసాలు చేస్తూ యువ ఓటర్లను బాగా ఆకట్టుకోవడంలో విజయం సాధిస్తున్నారు.
చూడాలి మరి ఈ ప్రచారం ఎంతవరకు కాంగ్రెస్ కు విజయాన్ని చేకూరుస్తుందో.