హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ ప్రధాన పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా మారింది.ముఖ్యంగా కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ చాలా హుషారుగా పాల్గొంటున్నారు.హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సమావేశంలో ప్రియాంక గాంధీ బీజేపీ పై సెటైర్లు వేశారు.
డబుల్ ఇంజన్ అంటూ బీజేపీ నాయకులు ఊదరగొట్టే కామెంట్లపై .మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వమే ఉంది.
కానీ ఇంజన్ లో ఇంధనం మారిపోయినట్టున్నట్టుంది.ఇక ఇదే సమయంలో నిరుద్యోగం ఇంకా పెన్షన్ సమస్యలను ప్రస్తావిస్తూ అధికార పార్టీని ఇరుకునపెట్టే రీతిలో ప్రియాంక గాంధీ తనదైన శైలిలో ప్రచారంలో ప్రసంగించడం జరిగింది.అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని, రూ.680 కోట్ల స్టార్టప్ ఫండ్ కేటాయిస్తామని, లక్ష ఉద్యోగాలు, 18 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ప్రతినెలా రూ.1,500 ఆర్థిక సహాయం.తొలి మంత్రివర్గ సమావేశంలోనే పాత పెన్షన్ పథకాన్ని తిరిగి తీసుకువస్తామని హామీల వర్షం కురిపించారు.