గత రెండు నెలలుగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.పలుమార్లు కేంద్ర పెద్దలతో చర్చలు జరుగుతున్న కూడా అవి ఒక కొలిక్కి రావడం లేదు.
ఇక ఈ విషయంలో రైతులకు ఇప్పటికే ఎందరో నాయకులు అండగా నిలిచారు.కాగా తాజాగా ఈ విషయంలో స్పందించిన ప్రియాంక గాంధీ, రైతుల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారట.
అదీగాక కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టం సూటు, బూటు వేసుకునే కార్పొరేట్లకు వరం అని, వీరికి ప్రధాని నరేంద్ర మోదీకి మధ్యగల అనుబంధానికి నిదర్శనమని ఎద్దేవా చేశారట.ఇక రైతులను నగరంలోకి రానీయకుండా ఢిల్లీ సరిహద్దుల్లో నిలిపేస్తున్న కేంద్ర సర్కారు, తన కార్పొరేట్ మిత్రులకు మాత్రం ఎర్ర తీవాచీలు పరిచి ఆహ్వానాలు పలుకుతున్నదని, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నదని ట్విట్టర్ వేదికగా ప్రియాంక గాంధీ మండిపడుతున్నారట.
ఇలా ఎంత కాలం రైతులను నడి రోడ్దులో నిలబెడతారని ఈ సందర్భంగా ప్రశ్నించారట.