ఎన్నికల సంగతి పక్కన పెడితే ప్రధాన పార్టీ నేతలు ఒకరిపై నొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.మొన్నటికి మొన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పెద్ద అవినీతి పరుడంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇంకా ఆ ఆరోపణల వేడి చల్లారక ముందే యూపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మోడీ ని భారతంలో సుయోధనుడి తో పోల్చారు.దీనిపై రాజీవ్ పై ‘భ్రష్టా చారి నెంబర్ 1’ అన్న మోడీ వ్యాఖ్యలను తిప్పికొట్టినట్లు అయ్యింది.
హర్యానా లోని అంబాలా లో మంగళవారం జరిగిన ర్యాలీ లో పాల్గొన్న ప్రియాంక గాంధీ వాద్రా భారతంలో దుర్యోధనుడి లా మోడీ దురహంకార అని,ఆయన అహంకారమే ఆయన ఓటమికి కారణం అవుతుంది అంటూ ఆమె నిప్పులు చెరిగారు.
గత ఎన్నికల్లో బీజేపీ నేతలు ఇచ్చిన హామీ ల అమలు గురించి తమ ప్రసంగాల్లో ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని ఆమె వ్యాఖ్యానించారు.
వారు కేవలం అమరవీరుల పేరుతోనో,మా కుటుంబానికి చెందిన అమర వీరుడు(రాజీవ్) పేరు తోనో ఓట్లు అడుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు.మోదీని దుర్యోధనుడిగా అభివర్ణిస్తూ ప్రియాంక చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిప్పికొట్టారు.
ఎవరు అర్జునుడో, ఎవరు దుర్యోధనుడో మే 23న తేలుతుందన్నారు.