బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకోవడంతో పాటు హాలీవుడ్ సినిమాలలో కూడా ఈ మధ్య కాలంలో వరుసగా నటిస్తూ తన హవా కొనసాగించేందుకు సిద్ధం అవుతున్న టాలెంటెడ్ నటి ప్రియాంకా చోప్రా.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అగ్ర హీరోయిన్ స్థాయికి ఎదిగి అక్కడి నుంచి హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళిపోయినా ప్రియాంకా చోప్రా ఈ మధ్య ఇండియన్ సినిమాల సంఖ్య తగ్గించేసింది.
హాలీవుడ్ సిరిస్ లతో పాటు సినిమాల మీద ఫోకస్ పెట్టింది.హాలీవుడ్ నటుడు, సింగర్ నిక్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువగా విదేశాలలో సెటిల్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఈ ఇండియా తరుపున విమెన్ వాయిస్ వినిపించడానికి ఇండియా తరుపున బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది.ఈ నేపధ్యంలో ప్రియాంకా చోప్రా డిజిటల్ ఒటీటీ సంస్థ అమెజాన్ తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది.
రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్న ప్రాజెక్టు కోసం ఆమె సంతకం చేసింది.ఈ ఒప్పందం విలువ కోట్లాది రూపాయల్లో ఉందని తెలుస్తోంది.హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ కార్యక్రమాన్ని రూపొందించనున్నారు.ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో మరింత భారతీయతను ప్రదర్శిస్తామని తెలిపింది.
ప్రాంతీయ భేదాలు, భాషా భేదాలు లేకుండా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే ప్రతిభకు ఒక ప్లాట్ ఫామ్ ను సిద్ధం చేయాలనేది తన కోరికని, అందుకే సొంత నిర్మాణ సంస్థ పర్పుల్ పెబల్ పిక్చర్స్ ను స్థాపించానని చెప్పింది. అమెజాన్ ప్రైమ్ తో చేయి కలపడానికి కూడా ఇదే కారణమని తెలిపింది.
మొత్తానికి ఈమె మహిళా హక్కుల, వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రత్యెక కార్యక్రమాలు నిర్వహించాలని అనుకోవడం నిజంగా గొప్ప విషయం
.