ఒకప్పుడు హీరోయిన్స్ అంటే సినిమాలలో ఎంత స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సంపాదించిన సొమ్ముని కేవలం కుటుంబ అవసరాల కోసం, విలాసాల కోసం మాత్రమే ఖర్చు పెట్టేవారు.ఈ కారణంగా చాలా మంది హీరోయిన్స్ కెరియర్ ముగిసిపోయిన తర్వతా జీవిత చరమాంకంలో ఆర్ధిక కష్టాలు అనుభవించాల్సి వచ్చింది.
మహానటి సావిత్రి లాంటి యాక్టర్ కూడా ఆర్ధిక కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.అయితే ఈ జెనరేషన్ హీరోయిన్స్ మాత్రం డబ్బు విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటారు.
సంపాదించిన సొమ్ముతో ఓ వైపు తమ ఆర్ధిక అవసరాలని తీర్చుకుంటూనే మరో వైపు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే విధానం ఫాలో అవుతూ ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతున్నారు, సినిమా ఎలాగూ ఎక్కువ కాలం ఉండేది కాదు కాబట్టి కెరియర్ కొనసాగుతున్నప్పుడు సంపాదించిన సొమ్ముతో సైడ్ బిజినెస్ లు మొదలు పెడుతున్నారు.
సౌత్ హీరోయిన్స్ అందరూ ఇప్పుడు ఇదే పంథా ఫాలో అవుతున్నారు.
చేతిలో అవకాశాలు ఉన్నప్పుడు సంపాదించిన సొమ్ముని వెనకేసుకొని దాంతో వ్యాపారాలు పెట్టేశాడు.తమన్నా, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రియ, సమంత ఇలా హీరోయిన్స్ అందరూ కూడా సైడ్ బిజినెస్ లు చేస్తున్నారు.
ఇప్పుడు ఇదే రూట్ లో బాలీవుడ్ భామలు కూడా వెళ్తున్నారు.ఇప్పటికే కొంత మంది భామలు ఇతర వ్యాపారాలలో భాగస్వాములుగా కొనసాగుతున్నారు.
కొంత మంది హీరోయిన్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలు చేస్తున్నారు.ఇండియన్ గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా కూడా ఇప్పుడో కొత్త వ్యాపారం మొదలు పెట్టింది.
ఇప్పటికే నిర్మాత మారి సినిమాలు చేస్తున్న ఈ భామ ఇప్పుడు హోటల్ బిజినెస్ లోకి అడుగుపెట్టింది.సోనా పేరుతో న్యూయార్క్ లో ప్రియాంక చోప్రా తన రెస్టారెంట్ ని ప్రారంభించింది.