బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
ఇది ఇలా ఉంటే తన భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయినా ఈ ముద్దుగుమ్మ ఇటీవల దాదాపు 3 ఏళ్ళ విరామం తర్వాత భారత్ కు చేరుకున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరియర్లు ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.
కెరియర్ ప్రారంభంలో తాను కూడా బాడీ షేమింగ్కు గురైనట్లు ప్రియాంక వెల్లడించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
కెరిర్ మొదట్లో తనని డస్కీ అని పిలిచేవారని ఆమె తెలిపింది.తొలి రోజుల్లో సహ నటుల కోసం సెట్లో గంటల తరబడి వేచి ఉండేదాన్ని అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.
డస్కీ అయితే అంటే ఏమిటో నాకు తెలియదు? నేను తగిన అందంగా లేనని అప్పుడు అనిపించిందని తెలిపింది.అంతేకాకుండా తనను నల్లపిల్లి అని వెటకారంగా పిలిచేవారని బాలీవుడ్ నటి ఆనాటి అనుభవాలను వివరించింది.
నేను చాలా కష్టపడి పని చేయాల్సిన ఉంటుందని నమ్మకంతో ఉండేదానిని అని వెల్లడించింది.
అయినప్పటికీ తోటి నటుల కంటే కాస్త ఎక్కువ ప్రతిభావంతురాలిగా భావించానని ఆమె చెప్పుకొచ్చింది.అయితే సహనటులు పొందిన వేతనంలో 10 శాతం కూడా తాను పొందలేదని చెప్పుకొచ్చింది.ఆ సమయంలో సహనటుడి కోసం వేచి ఉండటం సరైందేనని భావించినట్లు ఆమె పేర్కొంది.
కాగా 2000 సంవత్సరంలో ప్రియాంక మిస్ ఇండియా గా నిలిచిన విషయం తెలిసిందే.బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.ప్రియాంక చోప్రా తనకంటే వయసులో పదేళ్లు చిన్నవాడైనా పాప్ సింగర్ నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.