సెలెబ్రెటీల పెళ్లిళ్లు అంటే ఆషామాషీగా ఉంటుందా .? ప్రతి ఒక్కరు దాని గురించే మాట్లాడుకుంటుంటారు.అంతే కాదు … ఎంతో ఆసక్తిగా… వాటి వివరాలు గురించి ఆరాతీస్తుంటారు.అలా ఆసక్తిగా ఎదురుచూసే వారికి ఇప్పుడో హాట్ టాపిక్ దొరికింది.అదే… బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సింగర్ నికి జోనస్ వివాహం పెద్ద సెన్సేషన్.వచ్చే నెలలో జరగబోతున్న వీరి వివాహానికి జోధ్పూర్ ప్యాలెస్ ముస్తాబవుతోంది.300 మంది ముఖ్యమైన అతిధులను ఆహ్వానిస్తున్నట్టు సమాచారం.
సెలెబ్రిటీల ఫోటోలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది.దీన్ని క్యాష్ చేసుకునే పనిలో పడింది ఈ జంట.అందుకుగానూ ఓ ప్రముఖ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.దాదాపు 2.5 మిలియన్ డాలర్లకు అంటే రూ.18 కోట్లకు రైట్స్ను అమ్మేశారు.ఫొటోలను బయటకు రాకుండా సంస్థ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
అయితే వచ్చిన ఈ మొత్తాన్ని ప్రియాంక దంపతులు ఓ చారిటీ సంస్థకోసం వినియోగించనున్నట్లు సమాచారం.