సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు చేసే ప్రతి పనిని అభిమానులు, నెటిజన్లు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారు.సెలబ్రిటీలు గొప్ప పనులు చేస్తే ప్రశంసించే అభిమానులే సెలబ్రిటీలు ఏదైనా తప్పు చేస్తే విమర్శలు చేస్తూ ఉంటారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.ప్రియాంక చోప్రా కొన్నేళ్ల క్రితం మెట్ గాలా ఈవెంట్ కు మొదటిసారి హాజరు కాగా ఆ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి.
ఈ ఈవెంట్ కు భర్త నిక్ జోనస్ తో కలిసి ప్రియాంక చోప్రా హాజరు కావడం గమనార్హం.ప్రముఖ సింగర్ రీటా ఓరా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రీటా ఓరా షేర్ చేసిన ఫోటోలలో ప్రియాంక చోప్రా నటుడు బ్లాక్ ఫాంథర్ తో మాట్లాడుతుండటం గమనార్హం.ప్రియాంక అతనితో మాట్లాడటంలో వింతేం లేకపోయినా ఆమె బాత్ రూమ్ లో బ్లాక్ ఫాంథర్ తో మాట్లాడారు.
దీంతో నెటిజన్లు ప్రియాంకను ట్రోల్ చేస్తున్నారు.
బ్లాక్ ఫాంథర్ తో మాట్లాడటానికి అంతకు మించి మరో ప్రదేశం దొరకలేదా.? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
ప్రియాంక చోప్రా ఆ తరువాత కూడా భర్త నిక్ తో కలిసి రెండుసార్లు మెట్ గాలాకు హాజరయ్యారు.సాధారణంగా ప్రియాంకను ఎవరైనా ట్రోల్ చేస్తే ఆమె ఫ్యాన్స్ మద్దతు ఇక్ఛేవారు.అయితే ఇప్పుడు మాత్రం నెటిజన్ల విమర్శలకు ఎలా కౌంటర్ ఇవ్వాలో ప్రియాంక ఫ్యాన్స్ కు అర్థం కావడం లేదు.
అయితే వయస్సు పెరుగుతున్నా ప్రియాంక చోప్రాకు సినిమా ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు.ప్రస్తుతం ఈ బ్యూటీ టెక్స్ట్ ఫర్ యూ అనే మూవీలో నటిస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తైనట్లు తెలుస్తోంది.