ఇటీవల గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్దార్ధ చోప్రా పెళ్లి ఆగిపోయిన సంగతి తెలిసిందే.సిద్దార్ధ తన చిరకాల స్నేహితురాలు ఇషితా కుమార్ తో నిశ్చితార్ధం జరుపుకోగా త్వరలో వారి పెళ్లి ఉంటుంది అని అందరూ భావించారు.
కానీ ఉన్నట్టుండి వారి పెళ్లి ఆగిపోయింది.అయితే ఇషిత ఆరోగ్యం సరిగా లేనందున అత్యవసర శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది అని, దీనితో ఏప్రిల్ 30 న జరగాల్సిన వారి పెళ్లి ఆగిపోయింది అంటూ వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పుడు మాత్రం ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయింది అన్న దానిపై ప్రియాంక తల్లి మధు చోప్రా పెద్డవి విప్పడం తో అసలు విషయం బయటకు వచ్చింది.
ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా లేనని, కొంచెం సమయం కావాలని సిద్ధార్థ చెప్పడంతో పెళ్లి రద్దు చేయాల్సి వచ్చిందన్నారు.
సన్నిహితుల సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న తన చిరకాల స్నేహితురాలు ఇషితా కుమార్తో సిద్ధార్థ చోప్రా వివాహం జరగాల్సింది.అయితే చివరి నిమిషంలో పెళ్లి రద్దు చేసుకున్నారు.
సిద్దార్ధ పెళ్ళికి సిద్ధంగా లేకపోవడం వల్లే ఈ పెళ్లి ఆగిపోయింది అంటూ మధు చోప్రా చెబుతున్నారు.ప్రస్తుతం పెళ్లి చేసుకోవడానికి సిద్దార్ధ సిద్ధంగా లేడని,మరికొంత కాలం ఆగుతానని చెప్పడం తో ఇరు కుటుంబాల అంగీకారం తో ఈ పెళ్లి రద్దు అయినట్లు తెలుస్తుంది.
అయితే మరోవైపు ఇషిత కు ఆమె తల్లిదండ్రులు బాసటగా నిలిచినట్లు తెలుస్తుంది.పెళ్లి ఆగిపోయిందని బాధ పడొద్దని.
సిద్దార్ధ కంటే మంచి వ్యక్తే జీవిత భాగస్వామి గా దొరుకుతాడని ధైర్యం చెప్పినట్లు తెలుస్తుంది.మొత్తానికి కారణం ఏదైనా వారి పెళ్లి రద్దు అయినట్లు స్పష్టంగా తెలుస్తుంది.