బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్ జోనస్ తాజాగా తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు.ఇటీవల కాలంలో ప్రియాంక చోప్రా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో భర్త పేరు తొలగించడంతో వీరిద్దరూ సమంత- నాగ చైతన్య బాటలో విడాకులు తీసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది.
కానీ బాలీవుడ్ బ్యూటీ అందరిని సర్ ప్రైజ్ చేసింది.సరోగసీ పద్ధతి ద్వారా ప్రియాంక చోప్రా ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.తాజాగా ప్రియాంక చోప్రా సోదరి మీరా చోప్రా ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
జూనియర్ ప్రియాంక చోప్రా వచ్చేసింది అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది.మీరా చోప్రా టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించింది.
అమెరికాకు చెందిన ఒక వీక్లీ మ్యాగజైన్ ప్రియాంక చోప్రా-నిక్ జోనస్ దంపతుల గురించి తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.వీరిద్దరూ 2018లో పెళ్లి చేసుకొని సంవత్సరం తర్వాత అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో స్థిరపడ్డారు.
అక్కడ ఈ దంపతులు దాదాపు 20 మిలియన్ల డాలర్లు వెచ్చించి ఒక విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు.ఈ దంపతులు ఇద్దరూ మూడు నెలలపాటు అక్కడే ఉండి కష్టపడి తమకు నచ్చినట్టుగా ఇంటిని డిజైన్ చేయించుకున్నారు.
వీరిద్దరూ ఇంత కష్టపడి ఇంటిని డిజైన్ చేసుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉందని, పుట్టబోయే పిల్లలతో గడిపే ప్రతి క్షణాన్ని జ్ఞాపకంగా ఉంచుకోవాలని ఈ దంపతులు కల.అందుకోసం అంత ఖర్చు చేసి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఆ ఇంటిని నిర్మించుకున్నారని ప్రచారం.ఇదిలా ఉండగా మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రియాంక చోప్రా దంపతులకు అభినందనలు తెలియజేశారు.అనుష్క శర్మ తనదైన రీతిలో నిద్రలేని రాత్రులు గడిపేందుకు సిద్ధంగా ఉండు.
అమ్మతనాన్ని ఆస్వాదించటానికి సిద్ధంగా ఉండు అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.