ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం అవ్వుతుంది.
ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించేశారు.ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ లో ఉంది.
పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని దర్శకుడు లింగుస్వామి రామ్ కోసం సిద్ధం చేశాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే క్రేజీ బ్యూటీ కృతి శెట్టిని ఫైనల్ చేశారు.
ఈ అమ్మడు క్రేజ్ కూడా సినిమాకి మరింత ప్లస్ కానుంది.ఇప్పుడు ఈ సినిమా కోసం మరో హీరోయిన్ ని కూడా ఖరారు చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తుంది.
నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మల్లు బ్యూటీ ప్రియాంకా ఆరుళ్ మోహన్ రీసెంట్ గా శర్వానంద్ తో శ్రీకారం సినిమాలో నటించింది.అయితే శ్రీకారం సినిమా బాగుందనే టాక్ తెచ్చుకున్న జాతిరత్నాలు వేవ్ ముందు నిలబడలేకపోయింది.
దీంతో సినిమాకి అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాలేదని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడుకి అదృష్టం వచ్చినట్లే వచ్చి వెనక్కి నెట్టేసింది.
శ్రీకారం సినిమా తర్వాత ప్రియాంకా ఆరుళ్ మోహన్ జాతకం టాలీవుడ్ లో పూర్తిగా మారిపోతుందని అనుకుంది.అయితే సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకోవడంతో హీరోయిన్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు.
అయితే ఇప్పుడు రామ్, లింగుస్వామి సినిమాలో ప్రియాంకాకి రెండో హీరోయిన్ గా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది.కథలో ఆమె పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని బోగట్టా.
త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.