ఈ మధ్యకాలంలో తెలుగులో మలయాళీ భామలు, తమిళ్ హవా సృష్టిస్తున్నారు.స్టార్ దర్శక, నిర్మాతలు, నార్త్ భామలని పక్కన పెట్టి వీరికి పెద్దపీట వేస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ రేంజ్ లో ఉన్న కీర్తి సురేష్, సాయి పల్లవి, రష్మిక మందన, పూజా హెగ్డే, నివేదా థామస్ వరకు అందరూ కూడా సౌత్ భామలే.వీరిలో తెలుగు తెరపై మెజారిటీగా ఉన్నదీ మలయాళీ భామలు అయితే, క్రేజీ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న సాయి పల్లవి తమిళ్ బ్యూటీ వీరి దారిలోనే మరో తమిళ్ అందం తెలుగు తెరపైకి వరుస అవకాశాలు సొంతం చేసుకుంటుంది.
నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ప్రియాంకా ఆరుళ్ మోహన్ ప్రస్తుతం శర్వానంద్ సరసన శ్రీకారం సినిమాలో నటిస్తోంది.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఇప్పుడు మరో స్టార్ హీరో అయిన రవితేజకి జోడీగా నటించే అవకాశాన్ని ఈ అమ్మడు సొంతం చేసుకుంది.
తాజాగా క్రాక్ సినిమాతో హ్యాట్రిక్ ఫ్లాప్ ల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమాలో నటిస్తున్నాడు.
రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.క్రైమ్ థ్రిల్లర్ గా ఉండబోయే ఈ సినిమాలో రవితేజ దొంగగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమా తర్వాత తన స్టైల్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ కమర్షియల్ కథాంశంతో త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రవితేజ ఒకే చెప్పాడు.సినిమా చూపిస్త మావా, నేను లోకల్ సినిమాలతో సత్తా చాటిన త్రినాథరావు రవితేజ కోసం తనకి అలవాటైన కామెడీ ఎంటర్ టైనర్ కథని సిద్ధం చేసేశాడు.
ఈ సినిమా కోసం ప్రియాంకా ఆరుళ్ మోహన్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్మేంట్ వచ్చే అవకాశం ఉంది.