బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.హాలీవుడ్ సినిమాలలో కూడా నటించి గ్లోబల్ బ్యూటీగా ప్రియాంక చోప్రా పేరు సంపాదించుకున్నారు.
సినిమాలు, వెబ్ సిరీస్ లలో వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ ప్రియాంక చోప్రా నటిగా బిజీగా ఉండటం గమనార్హం.వయస్సులో తనకంటే పది సంవత్సరాల చిన్న వ్యక్తిని పెళ్లి చేసుకుని కొన్నేళ్ల క్రితం ప్రియాంక చోప్రా వార్తల్లో నిలిచారు.
ఎప్పుడూ బిజీగా ఉండే ప్రియాంక కరోనా, లాక్ డౌన్ వల్ల ఏడాది కాలంగా షూటింగ్ లకు దూరంగా ఉన్నారు.ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెబ్ సిరీస్ షూటింగ్ జర్మనీలో జరిగింది.
అయితే షూటింగ్ సమయంలో ప్రియాంక చోప్రా భయంతో కన్నీళ్లు పెట్టుకున్నారని సమాచారం.ప్రియాంక చోప్రా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
సంవత్సరం పాటు సినిమాలు లేకపోవడంతో ఇంట్లోనే సేఫ్ గా ఉన్నానని ప్రియాంక చోప్రా అన్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా ఉన్నానని కరోనా పాండమిక్ సమయంలో షూటింగ్ అని చెప్పగానే భయం వేసిందని ప్రియాంక తెలిపారు.
అయితే షూటింగ్ ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో జర్మనీకి వెళ్లాల్సి వచ్చిందని ప్రియాంక చోప్రా వెల్లడించారు.జర్మనీ విమానం ఎక్కిన వెంటనే తనకు కన్నీళ్లు ఆగలేదని ఆమె అన్నారు.అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ షూట్ చేయడంతో భయం తగ్గిందని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ప్రియాంక చోప్రా సినిమాలు, వెబ్ సిరీస్ ల కొరకు రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారు.వరుస ప్రాజెక్ట్ లతో ప్రియాంక చోప్రా బిజీగా ఉండటం గమనార్హం.
ప్రియాంక చోప్రా షూటింగ్ లతో బిజీ కావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
తాజా వార్తలు