తెలుగు లో చాలా సినిమా ల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ ప్రియమణి. జాతీయ స్థాయి అవార్డును సైతం దక్కించుకుని గొప్ప నటిగా పేరు దక్కించుకున్న ప్రియమణి కొన్నాళ్ల క్రితం ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకుంది.
వీరి సంసార జీవితం సాఫీగా సాగుతుందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ముస్తఫా రాజ్ యొక్క మొదటి భార్య మీడియా ముందుకు వచ్చింది.ఆమె మాట్లాడుతూ ముస్తఫా రాజ్ తనకు విడాకులు ఇవ్వలేదు.
కనుక తాను ఇంకా అతడి భార్యనే.ఈ సమయంలో ప్రియమణి ఖచ్చితంగా ముస్తఫాకు భార్య అవ్వలేదు.
ఇద్దరు పెళ్లి చేసుకున్నా అది చెల్లదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.మీడియా ముందుకు ఆమె వచ్చి చేసిన నానా రచ్చతో ప్రియమణి మనసు నొచ్చుకుందని.
అప్పటి నుండి భర్త ముస్తఫా రాజ్ కు దూరంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.గత కొన్ని రోజులుగా వస్తున్న ఆ వార్తల విషయంలో ప్రియమణి రియాక్షన్ ఏమీ లేదు.
సోషల్ మీడియాలో కూడా ఆమె ఆ వార్తలు ఖండించలేదు.దాంతో అంతా నిజమే అనుకుంటున్నారు.
ఈ సమయంలో దీపావళి సందర్బంగా తన భర్త ముస్తఫా రాజ్ తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి దీపావళి పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.
దీపావళి సందర్బంగా ప్రియమణి షేర్ చేసిన ఫొటోతో మొత్తం సీన్ క్లీయర్ అయ్యింది.ఇన్ని రోజులుగా వస్తున్న వార్తలు పుకార్లే అని తేలిపోయింది.ఇదే సమయంలో ముస్తఫా రాజ్ కూడా తన మొదటి భార్యకు చట్ట ప్రకారం విడాకులు ఇచ్చాడట.
ఇప్పుడు ప్రియమణి అధికారికంగా భార్య అయ్యిందట.ప్రియమణి తో మొదట్లో పెళ్లి సమయంలోనే ముస్తఫా రాజ్ భార్య రాజీ పడింది.
ప్రతి నెల భరణం తీసుకుని సైలెంట్ గా ఉండేందుకు ఒప్పుకుంది.కాని నెల వారి భరణం ఎక్కువ డిమాండ్ చేసి మీడియాలో నానా రచ్చ చేసింది.