స్టార్ హీరోయిన్ ప్రియమణి, ముస్తఫా రాజ్ ల వివాదం చెల్లదంటూ తాను ముస్తఫా రాజ్ కు విడాకులు ఇవ్వలేదంటూ ముస్తఫా మొదటి భార్య అయేషా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.అయేషా చేసిన కామెంట్ల గురించి ప్రియమణి పరోక్షంగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ముస్తఫా రాజ్ తనకు భర్తగా దొరకడం అదృష్టమని ఆమె చెప్పుకొచ్చారు.ముస్తఫా రాజ్, తనకు మధ్య రిలేషన్ షిప్ చట్టవిరుద్ధమైన రిలేషన్ షిప్ కాదని ప్రియమణి స్పష్టం చేశారు.
భర్తతో తాను రోజూ ఫోన్ లో మాట్లాడుతున్నానని తన భర్త ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని ఆమె స్పష్టం చేశారు.తన భర్త ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని తాము అన్యోన్యంగా ఉన్నామని ప్రియమణి చెప్పుకొచ్చారు.
ఫోన్ లో మాట్లాడుకోవడం కుదరకపోతే హాయ్, బాయ్ చెప్పుకుంటామని తనకు షూటింగ్ లు లేకపోతే భర్తకు ఫోన్ చేస్తానని ఆమె అన్నారు.భర్త ఖాళీగా ఉంటే తనతో చాట్ చేస్తాడని ఆమె అన్నారు.
తనకు, ముస్తఫా రాజ్ కు మధ్య మనస్పర్ధలు లేవని ప్రతి విషయం ఒకరితో మరొకరు షేర్ చేసుకుంటామని ఏ బంధానికైనా అదే అవసరమని ప్రియమణి చెప్పుకొచ్చారు.ముస్తఫా రాజ్ మొదటి భార్య అయేషా పేరెత్తకుండా కామెంట్లు చేయడం గమనార్హం.2010 సంవత్సరంలో అయేషా, ముస్తఫా రాజ్ ల వివాహం జరిగింది.ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో అయేషా, ముస్తఫా రాజ్ విడిపోయారు.
అయేషాకు ఇద్దరు పిల్లలు ఉండటంతో ముస్తఫా రాజ్ ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఆమెకు పంపిస్తున్నారు.2017 సంవత్సరంలో ప్రియమణి, ముస్తఫా రాజ్ ల వివాహం జరిగింది.ప్రియమణి కామెంట్ల గురించి ముస్తఫా రాజ్ భార్య అయేషా ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.ప్రియమణి నారప్ప మూవీతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.