మహానటి సినిమాతో ఒక్కసారిగా తన ఫేంని పెంచుకున్న భామ నటి కీర్తి సురేష్.ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో ఓ బయోపిక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఫుట్ బాల్ ఆటగాడు జీవిత కథతో తెరకెక్కే ఈ సినిమాలో అజయ్ దేవగన్ టైటిల్ రోల్ పోషిస్తూ ఉండగా అతని భార్య పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ సినిమాని అమిత్ రవీంద్రనాథ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.పదిరోజుల షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా నుంచి కీర్తి సురేష్ అనూహ్యంగా తప్పుకుంది.
ఇందులో పాత్రకి తాను సరిపోననని, అలాగే అజయ్ దేవగన్ కి జోడీగా సెట్ కాలేదని తనకి తానుగా చెప్పి తప్పుకున్నట్లు తెలుస్తుంది.చిత్ర యూనిట్ కూడా ఆమె నిర్ణయానికి సమ్మతించడం జరిగిందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే కీర్తి సురేష్ వదులుకున్న పాత్రకి ఇప్పుడు చిత్ర యూనిట్ ప్రియమణిని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.తెలుగులో ప్రస్తుతం సినిమాలు పెద్దగా లేకపోవడంతో ఖాళీగా ఉంటూ రియాలిటీ షోలకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న ప్రియమణి ఓ వెబ్ సిరిస్ గా నటిస్తుంది.
ఇక అందులో హౌస్ వైఫ్ పాత్రలోనే ప్రియమణి నటిస్తుంది.ఈ వెబ్ సిరిస్ చూసిన తర్వాత అజయ్ దేవగన్ కి జోడీగా ప్రియమణి అయితే సరిపోతుందని చిత్ర యూనిట్ భావించి ఆమెని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.
అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా కన్ఫర్మ్ కాలేదు.గతంలో మణిరత్నం రావణ సినిమాలో ప్రియమణి బాలీవుడ్ ప్రేక్షకులకి చేరువైంది.అయితే మొదటి సారి హీరోయిన్ తరహా పాత్రలో కనిపించడం విశేషం.