టాలీవుడ్లో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బ్యూటీ ప్రియమణి, వరుసబెట్టి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.ఇక పెళ్లి తరువాత ఈ బ్యూటీ హీరోయిన్గా చాలా తక్కువ సినిమాలు చేస్తున్నా, చేసిన సినిమాలు మాత్రం అమ్మడికి చాలా పేరును తీసుకొస్తున్నాయి.
సినిమాలే కాకుండా పలు టీవీ షోలలో కూడా జడ్జిగా మారి ప్రియమణి ఫుల్ బిజీగా మారింది.
కర్ణాటకకు చెందిన ముస్తఫా రాజ్ను ప్రియమణి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
పెళ్లి తరువాత తన భార్యకు సంబంధించిన అన్ని పనులను తానే చూసుకుంటున్నాడు.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా తన వద్ద మేనేజర్గా తన భర్తనే ప్రియమణి పెట్టుకుంది.
తనకు సంబంధించిన డేట్లు, కాల్షీట్లు వగైరా వంటి విషయాలను ఇకపై తన భర్త చూసుకుంటాడని ఆమె తెలిపింది.దీంతో భర్తకు తన వద్దే ఉద్యోగం ఇచ్చిన హీరోయిన్గా ప్రియమణి నిలిచిందని అందరూ ఆమెను ప్రసంశిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే అమ్మడు నారప్ప చిత్రంలో హీరోయిన్గా నటిస్తోండగా, రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న విరాటపర్వం చిత్రంలో నక్సలైట్ పాత్రలో ప్రియమణి నటిస్తోంది.వరుసగా సినిమాలు చేస్తున్న ప్రియమణి బుల్లితెరపై కూడా చాలా బిజీగా మారింది.
మరి ఈ బ్యూటీ నారప్ప, విరాటపర్వం చిత్రాలతో ఎలాంటి సక్సెస్ను అందుకుంటుందో చూడాలి.