మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక సోషల్ మెసేజ్తో రాబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ యాక్టింగ్ మరో లెవెల్లో ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తోంది.సరికొత్త లుక్లో చిరు మనకు ఈ సినిమాలో కనిపిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది.
ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్లో పెట్టే పనిలో పడ్డాడు చిరంజీవి.
ఎవరూ ఊహించని విధంగా ఇప్పటికే దర్శకుడు మెహర్ రమేష్తో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు మెగాస్టార్.
తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి తెలుగు రీమేక్గా ఈ సినిమా రానుందని ఆయన తెలిపారు.కాగా మలయాళంలో సూపర్ సక్సె్స్ అయిన లూసిఫర్ చిత్రాన్ని కూడా ఆయన తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
ఈ సినిమా రీమేక్ రైట్స్ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంతం చేసుకోవడంతో, ఈ సినిమాలో చిరు నటించనున్నాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని తీసుకుంటారా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కాగా సీనియర్ హీరోయిన్ ప్రియమణి ఈ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.డీగ్లామర్ పాత్రల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ప్రియమణి అయితే ఈ సినిమాకు పూర్తి న్యాయం చేస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
మలయాళ లూసిఫర్ చిత్రంలో మంజూ వారియర్ నటనకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.ఇప్పుడు ఆమె చేసిన పాత్రలో ప్రియమణిని తీసుకునేందుకు చిరు అండ్ టీమ్ ఆసక్తిగా ఉన్నారట.
ఇక ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యత తమిళ దర్శకుడు మోహన్ రాజాకు దక్కింది.ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చిరు రెడీ అవుతున్నాడు.
మరి లూసిఫర్ తెలుగు రీమేక్లో ప్రియమణి నటిస్తుందో లేదో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.