పెళ్ళైన కొత్తలో సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ ప్రియమణి.మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన ఈ భామ తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన యమదొంగ మూవీలో మెయిన్ హీరోయిన్ గా నటించి ఒక్కసారిగా స్టార్ అయిపొయింది.
ఆ మూవీ తర్వాత ప్రియమణి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలని సొంతం చేసుకుంది.తమిళ్ లో పరుత్తివీరన్ అనే మూవీకి ఈ బ్యూటీ ఏకంగా నేషనల్ అవార్డు అందుకుంది.
ఇక తెలుగుతో పాటు మిగిలిన మూడు బాషలలో గ్యాప్ లేకుండా హీరోయిన్ గా సినిమాలు చేస్తూ వచ్చిన ఈ అమ్మడు చివరిగా మన ఊరి రామాయణం సినిమాతో ఇంటరెస్టింగ్ రోల్ లో తెలుగు ప్రేక్షకులని పలకరించింది.మళ్ళీ ఐదేళ్ళ తర్వాత నారప్ప, విరాటపర్వం సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతుంది.
అయితే సినిమాలలో కనిపించకపోయినా డీ డాన్స్ షోలో జడ్జ్ గా తెలుగు ప్రేక్షకులకి కనిపిస్తూనే ఉంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ నారప్పలో వెంకటేష్ కి హీరోయిన్ నటించే అవకాశం రావడంపై ఆసక్తికర వాఖ్యలు చేసింది.విక్టరీ వెంకటేష్ తో నటించే అవకాశం తనకి మూడు సార్లు వచ్చి చేజారిపోయిందని పేర్కొంది.అయితే ఫైనల్ గా అతనితో కలిసి నటించాలనే తన డ్రీమ్ నారప్ప సినిమాతో తీరబోతుందని చెప్పింది.
అలాగే రీఎంట్రీలో కూడా తనకి నారప్ప సరైన అవకాశం అని పేర్కొంది.నారప్ప, విరాటపర్వం సినిమాల తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అవుతానని ధీమా వ్యక్తం చేసింది.