టాలీవుడ్లో తెరకెక్కుతున్న ఆసక్తికరమైన చిత్రాల్లో రానా దగ్గుబాటి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విరాట పర్వం కూడా ఒకటి.ఈ సినిమాను దర్శకుడు వేణు ఉడుగుల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమా టైటిల్ను అనౌన్స్ చేసిన సమయం నుండి ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇప్పటికే ఈ సామాజిక అంశాలతో కూడుకున్న చిత్రంగా తెరకెక్కుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
అయితే ఈ సినిమా నుండి గతకొద్ది రోజులుగా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో తాజాగా ఈ సినిమా నుండి ఓ ఆసక్తికరమైన విషయాన్ని చిత్ర యూనిట్ రివీల్ చేశారు.ఈ సినిమాలో నటి ప్రియమణి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు, ఆమె పాత్ర పేరు కామ్రేడ్ భారతక్క అని చిత్ర యూనిట్ తెలిపింది.
దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ ప్రియమణి పుట్టినరోజును పురస్కరించుకుని రిలీజ్ చేశారు.ఈ పోస్టర్లో ప్రియమణి పూర్తిగా నక్సలైట్ గెటప్లో కనిపిస్తుంది.ఈ పోస్టర్లో ప్రియమణి నవ్వుతూ ఉండటంతో ఈ సినిమా కథపై చాలా ఆసక్తి కలుగుతోంది.
ఇక రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమాలో ప్రియమణి పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని, ఫ్రెంచ్ రెవల్యూషన్లో విద్యార్థుల పాత్ర ఎంత కీలకమో ప్రియమణి పాత్ర కూడా ఈ సినిమాకు అంతే కీలకమని చిత్ర యూనిట్ అంటోంది.ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తుండగా నందితా దాస్, నవీన్ చందర, జరీనా వాహబ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.