వెంకటేష్ హీరోగా అసురన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.ఆ చిత్రంకు నారప్ప అనే టైటిల్ను పెట్టారు.
ఇప్పటికే చిత్రీకరణ చాలా స్పీడ్గా జరుగుతుంది.ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ఎంతో మందిని సంప్రదించి చివరకు ప్రియమణికి ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.
తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా పలు చిత్రాల్లో నటించి స్టార్గా గుర్తింపు దక్కించుకుని ఈమద్య కాస్త ఫేడ్ ఔట్ అయిన ఈ అమ్మడు బుల్లి తెరపై అప్పుడప్పుడు మెరుస్తూనే ఉంది.
తాజాగా ఈమె నారప్ప సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.ఈ చిత్రంలో వెంకటేష్కు జోడీగా నటించబోతుండటంతో ఈమె మళ్లీ తెలుగులో బిజీ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.ఇదే సమయంలో ప్రియమణి ‘విరాటపర్వం’ చిత్రంలో కీలక పాత్రను చేసేందుకు కమిట్ అయినట్లుగా తెలుస్తోంది.
రానా హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తున్న విషయం తెల్సిందే.ఆమె కాకుండా కీలక పాత్ర కోసం ప్రియమణిని కూడా తీసుకున్నారు.
ఒకేసారి బాబాయి వెంకటేష్ మరియు అబ్బాయి రానాల చిత్రంలో నటించే అవకాశం రావడం కాకతాళీయం అయినా కూడా ఈ అమ్మడు ఒకేసారి నక్క తోక తొక్కిందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.గత రెండేళ్లుగా పెద్దగా ఆఫర్లు లేకుండా ఉన్న ఈ అమ్మడికి 2020 సంవత్సరం మంచి స్టార్టింగ్ను ఇచ్చిందంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు.ఈ చిత్రాలతో మళ్లీ ఈమె ఏ మేరకు బిజీ అవ్వనుందో చూడాలి.