టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ ప్రియమణి.కెరీర్ మొదట్లో తెలుగు అమ్మాయిగా కనిపించిన ఈ బ్యూటీ తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఓ సక్సెస్ ను అందుకుంది.
స్టార్ హీరోల సరసన కూడా నటించింది.ఇక ఆ తర్వాత పలు సినిమాలలో గ్లామర్ ను మరింత పరిచయం చేసింది ఈ భామ.తన పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ప్రియమణి తాజాగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.
ఇటీవలే హిందీలో ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించింది.
ప్రస్తుతం బుల్లితెర లో కూడా ఓ డాన్స్ షోలో జడ్జిగా చేస్తుంది.లేటు వయసులో కూడా తన అందాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం దగ్గుబాటి రానా నటిస్తున్న విరాటపర్వం సినిమాల్లో ఓ కీలక పాత్రలో నటిస్తుంది.అంతేకాకుండా హీరో వెంకటేష్ నటిస్తున్న నారప్ప సినిమాలో కూడా బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే ప్రియమణికి ఓ వ్యక్తి తో ఎఫైర్ ఉండగా తాజాగా ఆ విషయం గురించి స్పందించింది.
గత ఏడాది డైరెక్టర్ రాజ్ డి.కె దర్శకత్వంలో ది ఫ్యామిలీ మన్ వెబ్ సిరీస్ లో నటించిన ప్రియమణి మంచి సక్సెస్ అందుకుంది.ఇందులో మనోజ్ బాజ్ పేయి భార్యగా సుచిత్ర పాత్రలో నటించింది ప్రియమణి.
ఇందులో లెక్చరర్ ఉద్యోగం వదిలేసి తన స్నేహితులు ప్రారంభిస్తున్న స్టార్టప్ కంపెనీలో భాగస్వామి అవుతుంది.దీని కోసం వేరే ప్రదేశానికి వెళ్లిన ప్రియమణి తన స్నేహితులతో ఎఫైర్ పెట్టుకున్నట్లు వెబ్ సిరీస్ లో కాస్త పరిచయం చేసినట్లు చేశారు.
ఇక అది నిజంగా జరిగిందా లేదా అని ఇప్పటివరకు క్లారిటీ రాకపోగా దీని గురించి తనకు కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి అని తెలిపింది.ఇక దాని గురించి స్పందించిన ప్రియమణి.
అతనితో ఎఫైర్ ఉందా లేదా అనేది సెకండ్ సీజన్ లో క్లారిటీ ఇస్తామని తెలిపింది.అంతేకాకుండా అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ సస్పెన్స్ లో పెట్టింది.
ఇక రెండవ సీజన్ లో సమంత నటించిన సంగతి తెలిసిందే.ఇది జూన్ 4న విడుదల కానుంది.