సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిజినెస్ లలో కూడా రాణిస్తున్నారు.సినిమాలలో హీరోలుగా నటించి అక్కడ వచ్చిన డబ్బును బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టి రెండు చేతుల సంపాదిస్తున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో కేవలం హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్లు అలాగే బుల్లితెర నటీనటులు కూడా వారి కెరియర్ పరంగా దూసుకెళ్తూనే మరొకవైపు బిజినెస్ లు కూడా రన్నింగ్ చేస్తున్నారు.తాజాగా మరొక హీరోయిన్ కూడా బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.
ఆమె మరెవరో కాదు బుల్లితెర నుండి వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన నటి ప్రియా భవాని శంకర్.
అతి తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది భవాని శంకర్.అయితే సినిమాలలో పాత చిన్నదా పెద్దదా అన్న సంగతి పక్కన పెడితే తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలను సొంతం చేసుకుంటోంది.మరోవైపు హీరోయిన్ గా కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
ఇక హీరో కార్తీ తో కలిసి నటించిన కుడైకుట్టి సింగం సినిమాలో చిన్న పాత్రలో నటించి మెప్పించింది.ఈ సినిమా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ను తెచ్చుకోవడంతో పాటు ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు కూడా వచ్చి చేరాయి.
ఇక ఇటీవలె ధనుష్ నటించిన తిరుచిట్రంఫలం సినిమాలో కూడా నటించింది.
ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియా భవాని శంకర్ తాను డబ్బు వస్తుందని కేవలం డబ్బు కోసం మాత్రమే సినిమాల్లో నటించడానికి వచ్చాను అని తెలిపిన విషయం తెలిసిందే.కానీ తాజాగా మాత్రం తాను అలా అనలేదు అంటూ ప్లేట్ ఫిరాయిస్తోంది.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తక్కువ కాలంలోనే డబ్బు బాగానే కూడా పెట్టింది ఈ ముద్దుగుమ్మ.
ఈ నేపథ్యంలోనే గత ఏడాది డిసెంబర్ నెలలో చెన్నై సముద్రతీరంలో ఒక కొత్త ఇంటిని కూడా కొనుగోలు చేసినట్లు తానే స్వయంగా వెల్లడించింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో తెగ చక్రర్లు కొడుతోంది.
అదేమిటంటే ఈ ముద్దుగుమ్మ వ్యాపారం రంగంలోకి కూడా అడుగుపెట్టబోతుంది.త్వరలోనే ఒక రెస్టారెంట్ కి కూడా ఓనర్ కాబోతోంది.అందుకోసం ఒక స్థలాన్ని కొనుగోలు చేసి రెస్టారెంట్ ను నిర్మిస్తోంది.అయితే ఆ రెస్టారెంట్ ని త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు తెలుపుతూ ప్రియాంక భవాని శంకర్ ఒక వీడియో ద్వారా విడుదల చేసింది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.