తిరుమల వేంకటేశుని కొండపై నిన్న అపచారం జరిగిపోయింది.తిరుమల కొండపైకి వచ్చిన ఓ బాబా… వెంకన్న సేవను పక్కనబెట్టి ప్రైవేట్ యాగ నిర్వహణలో మునిగిపోయారు.
అయితే ఇలాంటి వ్యవహారాలపై నిఘా వేయాల్సిన విజిలెన్స్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు.ప్రస్తుతం ఈ వ్యవహారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిలో పెద్ద దుమారాన్నే రేపనుంది
ఇక వివరాల్లోకెళితే… వెంకన్న సేవకంటూ బర్శీ బాబాగా ప్రసిద్ధి చెందిన ఓ బాబా నిన్న కొండపైకి చేరుకున్నారు.
అయితే వెంకన్న సేవకు అంతగా ప్రాధాన్యమివ్వని బర్శీ బాబా… శ్రీవారి కుటీర్ లో ప్రైవేట్ యాగాన్ని నిర్వహించారు.దీనిపై ముందుగానే సమాచారం ఉన్నా, విజిలెన్స్ సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.