ప్రస్తుత కాలంలో కొందరు ఎంటర్ టైన్ మెంట్ యాప్ అయినటువంటి టిక్ టాక్ కి బానిసలై సమయం సందర్భం లేకుండా వీడియోలు చేస్తూ అప్లోడ్ చేస్తున్నారు.తాజాగా ఓ యువతి లాక్ నిబంధనలను పాటించకుండా రోడ్లు ఖాళీగా ఉన్నాయి కదా అని మూసి వేసిన రోడ్లపై టిక్ టాక్ వీడియోలు చేసినందుకుగాను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన అహ్మదాబాద్ పరిసర ప్రాంతంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే సోను నాయక్ అనే ఓ యువతి స్థానిక అహ్మదాబాద్ పరిసర ప్రాంతంలో నివాసముంటోంది.అయితే ఈమె కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది.
అయితే సోను నాయక్ అప్పుడప్పుడు కాలక్షేపం కోసం టిక్ టాక్ వీడియోలను చేస్తూ ఉండేది.చివరికి ఈ వ్యసనమే ఆమెను కటకటాల పాలు చేసింది.
తాజాగా సోనూ నాయక్ టిక్ టాక్ వీడియోలు చేసే నెపంతో రాత్రి తొమ్మిది గంటల సమయంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై సంచరించింది.అయితే ఈ రాత్రి సమయంలో తీసినటువంటి ఈ టిక్ టాక్ వీడియోలు పోలీసు అధికారులు గుర్తించడంతో వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అలాగే ఏ ఇతర కారణాల వల్ల అయినా రాత్రి సమయంలో అనవసరంగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.