పక్షులు, జంతువులు అంటే ఎంతోమందికి ప్రాణం.ఎంత ప్రేమ ఉన్న వాటికీ ఒక గూడు, తిండి, నీళ్లు పెడుతారు.
అంతేకాని వాటి కోసం పనులు ఆపుకొని కూర్చునే వారు చాలా అరుదు.అలాంటిది ఓ వ్యక్తి కారుపై ఓ పక్షి గూడు కట్టుకుందని దానికి హాని కలిగించడం ఇష్టం లేక ఏకంగా 2 కోట్ల రూపాయిల కారును వాడకుండా పక్కన పెట్టేసాడట.
ఆశ్చర్యంగా ఉంది కదా!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.దుబాయికి యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూంకు చెందిన 2 కోట్ల రూపాయిల కారుపై ఇటీవల ఓ పక్షి గూడు కట్టుకుంది.
దానిలో జాగ్రత్తగా గుడ్లు పెట్టి పొడగటం ప్రారంభించింది.దీని గమనించిన ఆ యువరాజు రషీద్ తన కారు వాడటం మానేశాడు.
ఆ పక్షికి ఎలాంటి ఆటంకం కలిగించకుండా ఆ ప్రదేశానికి సిబ్బంది దూరంగా ఉండాలని తన సిబ్బంది ఆదేశాలు జారీ చేశాడు.దానిని ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ గమనిస్తున్న యువరాజు ఆ పక్షి పెట్టిన గుడ్ల నుంచి చిన్న పక్షిపిల్లలు బయటకు వస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఇంకా ఆ వీడియోని పోస్ట్ చేస్తూ ”మన జీవితంలో చిన్న చిన్న విషయాలే ఎంతో సంతృప్తిని కలిగిస్తాయి” క్యాప్షన్ పెట్టాడు.ఆ వీడియోను చుసిన నెటిజన్లు మీ మనసు ఎంత సున్నితం.
ఎంత అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.