ప్రధాని నరేంద్ర మోడీ మీద ఒక జోక్ ఉంది.ఆయన భారత్ ను పరిపాలిస్తున్న విదేశీ ప్రధాని అని సరదాగా అంటూ ఉంటారు కొందరు.
ఆయన విదేశాల్లో ఉంటూ అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా ఇండియాకు వచ్చి పోతూ ఉంటారని అంటారు.ప్రధాని అప్పుడప్పుడు ఇండియాకు వచ్చి వెళుతుంటారు అనే కామెంటుతో కొంత కాలం కిందట ఒక కార్టూన్ ప్రచురితమైంది.
నిజమే మోడీ దేశంలో ఉండేది తక్కువే.నెలలో ఎక్కువ రోజులు విదేశీ ప్రయాణాల్లోనే గడుపుతున్నారు.
పెట్టుబడుల కోసం కొన్ని దేశాలకు, చర్చల కోసం కొన్ని దేశాలకు, అంతర్జాతీయ సమావేశాల కోసం కొన్ని దేశాలకు వెళుతున్నారు.ఈ మధ్యనే అంటే ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు లండన్, టర్కీలలో పర్యటించారు.
నాలుగు రోజులు ఇండియాలో ఉండగానే మళ్ళీ ప్రయాణం అయ్యారు.ఈ నెల 21 నుంచి 25 వరకు మలేషియా, సింగపూర్ వెళుతున్నారు.
డిసెంబర్లో రష్యా, చైనా పర్యటనలు ఉన్నాయి.మోడీ విపరీతంగా దేశాలు తిరుగుతున్నారు కానీ ఏం సాధిస్తున్నారని ఆయన ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
విదేశాలకు వెళ్ళినప్పుడు అనేక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.కానీ వివరాలు పెద్దగా బయటకు రావడంలేదు.
ఏ విదేశానికి వెళ్ళినా ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు.కానీ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ పెట్టుబడులు రాలేదని ప్రతిపక్షాల వారు విమర్శిస్తున్నారు.
ఎవరు ఎలా విమర్శించినా ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తికీ విదేశీ పర్యటనలు తప్పవు మరి.