ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 11న హైదరాబాద్ పర్యటనకు రానున్నారని సమాచారం.ఈ పర్యటనలో భాగంగా హెచ్ఐసీసీలో జరిగే అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
కాగా, హెచ్ఐసీసీలో ఈనెల 10 నుంచి 14 వరకు UNWGIC సదస్సు జరగనున్న విషయం తెలిసిందే.అయితే, సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన తర్వాత మోదీ హైదరాబాద్ పర్యటనకు రావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో బీజేపీ కార్యక్రమాల షెడ్యూల్ ఉండవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం అవుతారా.? లేక పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారా అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.