తెలంగాణాలో రేపు ప్రధాని మోదీ పర్యటన !

తెలంగాణాలో అన్ని పార్టీలు వేగం పెంచి దూసుకుపోతుండడం … ఆ రేసులో వెనుకబడిపోవడంతో… బీజేపీ కూడా వేగం పెంచేందుకు అగ్ర నేతలతో సభలు సమావేశాలు ప్లాన్ చేసింది.అందులో భాగంగానే… తెలంగాణాలో ప్రధాని నరేంద్రమోదీ తో ఎన్నికల ప్రచారం చేయించేందుకు ప్లాన్ వేసేంది.

 Prime Minister Narendhra Modhi Visit To Telangana Tomorrow-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు.రేపు ఉదయం 11 గంటల 50 నిమిషాలకు నిజామాబాద్‌ చేరుకోనున్న మోదీ అక్కడ జరగబోయే… బహిరంగ సభలో పాల్గొంటారు.

అనంతరం మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు.ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన స్థానిక బీజేపీ నాయకులు అందుకు తగ్గట్టుగా భారీగా జనసమీకరణకు ప్రయత్నిస్తున్నారు.

ప్రధాని మోడీ మొదటి విడతలో రేపు నిజామాబాద్, మహబూబ్‌ నగర్‌లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు.ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న మోడీ ప్రత్యేక హెలికాఫ్టర్ లో 11 గంటల 50 నిమిషాలకు నిజామాబాద్‌ చేరుకోనున్నారు.అక్కడ జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.అనంతరం మహబూబ్ నగర్ బహిరంగ సభకు హాజరవుతారు.తర్వాత, హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.ఈ పర్యటన అనంతరం, డిసెంబర్ 3న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు.

అమిత్ షా కూడా మరో రెండు సార్లు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించున్నారు.ఈనెల 28న, డిసెంబర్ 2న జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube