గుజరాత్లోని గాంధీనగర్లో డిజిటల్ ఇండియా వారోత్సవాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఓ అంధ విద్యార్థి పట్ల ఎంతో ఆకర్షితులయ్యారు.ఆ 11 ఏళ్ల దివ్యాంగ చిన్నారితో ముచ్చటించిన ప్రధాని.
ఆ బాలుడి ప్రతిభను చూసి ఆశ్చర్యపోయారు.ఆ చిన్నారిని కలిశాక తనలో అమితమైన ఆత్మవిశ్వాసం కలిగిందంటూ ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు…
డిజిటల్ ఇండియా వారోత్సవాలను ప్రారంభించిన ప్రధాని.
అక్కడ ప్రదర్శనకు ఉంచిన పలు నూతన ఆవిష్కరణలను తిలకించారు.ఆ సందర్భంగా థింకర్బెల్ ల్యాబ్స్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న 11 ఏళ్ల ప్రథమేశ్ సిన్హాతో ప్రధాని ముచ్చటించారు.
ఆ సంస్థ అంధులు బ్రెయిలీ లిపిని సులభంగా నేర్చుకునేందుకు వీలుగా యాన్నీఅనే గ్యాడ్జెట్ను తయారు చేసింది… ప్రథమేశ్ ఆ పరికరం గురించి ప్రధానికి వివరించాడు.అతడు చెబుతున్నతీరును ప్రధాని ఎంతో ఆసక్తిగా గమనించారు.
ఆ చిన్నారికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.పూణే నుంచి వచ్చిన ఆ చిన్నారిని తల నిమిరి అభినందించారు…
ఆ తర్వాత ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రథమేశ్ గురించి ప్రస్తావించారు.తాను ఆ బాలుడితో మాట్లాడినప్పుడు అతడు.ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా తనను తాను పరిచయం చేసుకున్న తీరు అబ్బురపరిచిందన్నారు.
ఇలాంటి వాళ్లను కలిసినప్పుడే.మన దేశం ఎక్కడా ఆగిపోదని, భవిష్యత్తు కలలను సాకారం చేసుకుంటుందన్న విశ్వాసం తనలో మరింత పెరుగిందని ప్రధాని అన్నారు.
ప్రధానితో ఆ అంధ బాలుడు ముచ్చటించిన వీడియోను థింకర్బెల్ ల్యాబ్స్ సంస్థ సోషల్మీడియాలో షేర్ చేసింది.విద్య అందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతోనే తాము ఆ పరికరాన్ని రూపొందించామని ఆ సంస్థ పేర్కొన్నది.
ఈ గ్యాడ్జెట్ గురించి ప్రథమేశ్ ప్రధానికి వివరించడం తమకు ఎంతో గర్వంగా ఉన్నదని తెలిపింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది…పూణేకు చెందిన ప్రథమేశ్ పుట్టుకతోనే అంధుడు… కానీ ఆ లోపాన్ని అధిగమించి తన టాలెంట్తో ఎంతోమంది దృష్టిని అతడు ఆకర్షించాడు… గతేడాది తాను ప్రచారకర్తగా ఉన్న థింకర్బెల్ ల్యాబ్స్ తరఫున ప్రముఖ షో.షార్క్ ట్యాంక్లో పాల్గొన్నాడు.అక్కడ యాన్నీ గ్యాడ్జెట్ గురించి అతడు ఇచ్చిన ప్రజెంటేషన్ చూసినవారు ప్రథమేశ్ ని అభినందనలతో ముంచెత్తారు.
.