ప్రస్తుతం దేశంలో వైరస్ కేసులు ఇంకా ఉధృతంగా నే కొనసాగుతున్న సంగతి తెలిసిందే.కొన్ని రాష్ట్రాలలో తగ్గినట్టు తగ్గి ఇప్పుడు మళ్లీ పెరిగే రీతిలో కేసుల సంఖ్య వస్తూ ఉండటంతో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు భయాందోళనకు చెందుతున్నారు.
ఇటువంటి తరుణంలో ఈ రీతిగా మళ్లీ కేసులు పెరుగుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు.తమిళనాడు, కర్ణాటక, కేరళ ఒడిశా, మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు.
థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉండటంతో ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కల్పన అదే రీతిలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేసేలా.రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రులకు మోడీ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.అదే రీతిలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు గురించి కూడా ముఖ్యమంత్రుల వద్ద ప్రధాని మోడీ వివరణ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జూలై 13 వ తారీకు ఈశాన్య రాష్ట్రాల తో కరోనా కట్టడి విషయంలో అనేక సూచనలు చేసిన మోడీ.జరగబోయే ఈ ముఖ్యమంత్రుల సమావేశంలో ఎటువంటి సూచనలు ఇస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.
.