దేశ ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది.ఈరోజు ఉదయం సమావేశం ప్రారంభం అవుతుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలియజేశారు.
ఇప్పటికే కేంద్ర క్యాబినెట్ లో కొత్త ముఖాలు వచ్చే అవకాశం ఉందని, మరి కొంతమందికి ఉద్వాసన కలిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.పరిస్థితి ఇలా ఉండగా కేంద్ర క్యాబినెట్ విషయంలో ప్రధాని మోడీ అదేరీతిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోపాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశాలు నిర్వహించడం జరిగింది.
దాదాపు కొన్ని రోజుల నుండి ప్రధాని మోడీ నివాసానికి జేపీ నడ్డా తోపాటు అమిత్ షా వెళుతూ చర్చలు జరుపుతూ ఉన్నారు.త్వరలో దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఎన్డీఏ కూటమి పార్టీలను ఏకం చేసే రీతిలో బీజేపీ హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వీటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర క్యాబినెట్ లోకి ఎన్డిఏ భాగస్వామ్య పార్టీల నాయకులను ఆహ్వానించే ఆలోచనలో బిజెపి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.